మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎంకు ఆహ్వానం..

- January 04, 2025 , by Maagulf
మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎంకు ఆహ్వానం..

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామి దివ్యస్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.

శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు కలిశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్‌కు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com