దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు: సీఎం రేవంత్ రెడ్డి
- January 05, 2025
హైదరాబాద్: తెలుగు వారు విదేశాలకు వెళ్లినా ఒకే వేదిక పై ఐక్యంగా కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, ప్రత్యేక ప్రసంగం చేశారు.
తెలుగుతో అనుబంధం తగ్గొద్దు
విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తెలుగును మరచిపోకూడదని, ప్రపంచంలో నూతన జ్ఞానం కోసం ఏ భాష నేర్చుకున్నా, తమ మాతృభాషను తక్కువ చేయకుండా గౌరవించాల్సిన అవసరముందని సీఎం సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హైదరాబాదు సంస్థలు నగర అభివృద్ధికి మార్గం చూపుతున్నాయని, ఇక్కడి వృద్ధికి తెలుగు పారిశ్రామిక వేత్తలు మరింతగా తోడ్పడాలని సీఎం ఆహ్వానం పలికారు.
తెలంగాణ అభివృద్ధికి గత ముఖ్యమంత్రుల కృషి చాలా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి తెలంగాణకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను తీసుకువచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మా రంగ పెట్టుబడులు కూడా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారాయి’’ అని గుర్తు చేశారు. తెలంగాణ ఆదాయంలో 65 శాతం నగరమైన హైదరాబాద్ నుంచే వస్తోందని, ఇది గత ముఖ్యమంత్రులు తీసుకున్న పరిణామకర నిర్ణయాల ఫలితమని సీఎం తెలిపారు.
జాతీయ రాజకీయాల్లో సన్నగిల్లిన తెలుగువారి పాత్ర
దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ వంటి మహానుభావులు కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి నాయకులు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపారని వివరించారు. అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గర్వకారణం
‘‘దేశంలో తయారవుతున్న బల్క్ డ్రగ్స్లో 35 శాతం హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతుండటం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. కానీ, చట్టసభల్లో తెలుగువారు మాట్లాడతారా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాయకుల ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ, నేటి రాజకీయాల్లో తెలుగువారి పాత్రను మరింత బలపరచాలని అవసరం ఉంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









