రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం..
- January 07, 2025
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళుతున్న రజనీ.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'కూలీ' సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. అయితే, ఓ రిపోర్టర్ సూపర్ స్టార్కు సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్న వేశారు.
దాంతో ఆ రిపోర్టర్పై ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విలేకరి... రజనీకాంత్కు మహిళల భద్రతపై ప్రశ్నించారు. దాంతో తనను పాలిటిక్స్ సంబంధిత ప్రశ్నలు వేయొద్దని సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









