రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం..
- January 07, 2025
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళుతున్న రజనీ.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'కూలీ' సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. అయితే, ఓ రిపోర్టర్ సూపర్ స్టార్కు సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్న వేశారు.
దాంతో ఆ రిపోర్టర్పై ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విలేకరి... రజనీకాంత్కు మహిళల భద్రతపై ప్రశ్నించారు. దాంతో తనను పాలిటిక్స్ సంబంధిత ప్రశ్నలు వేయొద్దని సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









