షాప్ ఆక్రమణదారుడికి కోర్టు షాక్..BD 25,000 చెల్లించాలని తీర్పు..!!
- January 10, 2025
మనామా: 2015 నుండి 2022 వరకు ఏడేళ్ల కాలానికి సంబంధించి మునిసిపల్ ఫీజు కింద BD 25,000 చెల్లించాలని ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఒక దుకాణ యజమానిని ఆదేశించింది. రాజధానిలో కీలక ప్రాంతంలో ఉన్న దుకాణాన్ని ఆక్రమించిన కంపెనీకి వ్యతిరేకంగా క్యాపిటల్ మున్సిపాలిటీ దావా వేసింది. పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ మొత్తం BD 25,000 మునిసిపల్ ఫీజును చెల్లించడంలో కంపెనీ విఫలమైందని మున్సిపాలిటీ పేర్కొంది. బాకీ ఉన్న ఫీజులతో పాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం సివిల్, కమర్షియల్ ఎవిడెన్స్ చట్టాన్ని ఉదహరిస్తూ.. నోటీసులు అందజేసిన దుకాణందారుడు కోర్టుకు హాజరుకావడం లేదా ఏదైనా రక్షణను సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సమర్పించిన సాక్ష్యం, క్లెయిమ్ను వ్యతిరేకించడంలో ఫాసు ఆక్రమణదారుడు విఫలమైనందున, మునిసిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. BD 25,000 లతోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







