షాప్ ఆక్రమణదారుడికి కోర్టు షాక్..BD 25,000 చెల్లించాలని తీర్పు..!!
- January 10, 2025
మనామా: 2015 నుండి 2022 వరకు ఏడేళ్ల కాలానికి సంబంధించి మునిసిపల్ ఫీజు కింద BD 25,000 చెల్లించాలని ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఒక దుకాణ యజమానిని ఆదేశించింది. రాజధానిలో కీలక ప్రాంతంలో ఉన్న దుకాణాన్ని ఆక్రమించిన కంపెనీకి వ్యతిరేకంగా క్యాపిటల్ మున్సిపాలిటీ దావా వేసింది. పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ మొత్తం BD 25,000 మునిసిపల్ ఫీజును చెల్లించడంలో కంపెనీ విఫలమైందని మున్సిపాలిటీ పేర్కొంది. బాకీ ఉన్న ఫీజులతో పాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం సివిల్, కమర్షియల్ ఎవిడెన్స్ చట్టాన్ని ఉదహరిస్తూ.. నోటీసులు అందజేసిన దుకాణందారుడు కోర్టుకు హాజరుకావడం లేదా ఏదైనా రక్షణను సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సమర్పించిన సాక్ష్యం, క్లెయిమ్ను వ్యతిరేకించడంలో ఫాసు ఆక్రమణదారుడు విఫలమైనందున, మునిసిపాలిటీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. BD 25,000 లతోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









