మహా కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్ ప్రారంభం
- January 14, 2025
ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. తాజాగా నిన్న డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మరో హిట్ కొట్టాడు. ఇప్పటికే మొదటి రోజు డాకు మహారాజ్ సినిమా 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలయ్య ఊపు ఇప్పట్లో ఆగేలా లేదు.
డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఖండ 2 సినిమాతో రానున్నాడు. అయితే ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడికి కోట్ల మంది భక్తులతో పాటు సాధువులు, అఘోరాలు భారీ సంఖ్యలో హాజరవుతారు.
అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అదే పాత్రని పార్ట్ 2 లో కంటిన్యూ చేయనున్నారు. దీంతో అఖండ పాత్ర కుంభమేళాలో ఉన్నట్టు, అక్కడ అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టు, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టు కొన్ని షాట్స్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో డివైన్ షాట్స్ ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండనున్నాయని తెలుస్తుంది. అన్ని లక్షల మంది జనాల్లో బాలయ్యతో షూట్ ప్లాన్ చేయడం, బాలయ్య ఒప్పుకోవడం, రియల్ లొకేషన్స్ లో రియల్ అఘోరాలతో షూట్ ప్లాన్ చేయడం గ్రేట్ అనే చెప్పొచ్చు.
దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25 దసరాకు రిలీజ్ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న మ్యూజిక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అఖండ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. దీంతో అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇది 4వ సినిమా కానుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









