కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు
- January 14, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కిషన్ రెడ్డి ఇంటిని అలంకరించారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.
కాగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి, చిరంజీవికి ఘనస్వాగతం సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!









