కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు
- January 14, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కిషన్ రెడ్డి ఇంటిని అలంకరించారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.
కాగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి, చిరంజీవికి ఘనస్వాగతం సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







