కేరళకు గల్ఫ్ ఎయిర్ సేవలు కుదింపు.. నిరసనల వెల్లువ..!!
- January 16, 2025
మనామా: కాలికట్కు విమానాలను రద్దు చేసి, కొచ్చికి సేవలను తగ్గించాలని గల్ఫ్ ఎయిర్ తీసుకున్న నిర్ణయంపై కేరళవాసులు మండిపడున్నారు. ఆన్లైన్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ ఎయిర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా భారతీయులను అవకాశాలకు ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు. కోజికోడ్ జిల్లా ప్రవాసీ ఫోరమ్ (KPF) ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇండియాలోని కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరంలో ఉన్న కాలికట్ చారిత్రాత్మకంగా గల్ఫ్కు, ముఖ్యంగా బహ్రెయిన్, ఇతర GCC దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కీలకమైన కేంద్రంగా ఉందని KPF స్పష్టం చేసింది. గల్ఫ్తో కాలికట్ సంబంధం శతాబ్దాల నాటిదని, ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ప్రముఖ ఓడరేవు నగరంగా ఉందని గుర్తుచేశారు. 1970వ దశకంలో కేరళ నుండి చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతానికి వలసలు ప్రారంభమైనప్పుడు ఈ సంబంధం మరింత బలపడిందని చెబుతున్నారు. కాలికట్కు గల్ఫ్ ఎయిర్ ఆక్యుపెన్సీ రేట్లు 90 శాతానికి మించి ఉన్నాయని, ఇది ఈ సేవలకు ఉన్న అధిక డిమాండ్ను ప్రతిబింబిస్తుందని గుర్తుచేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







