ఒమన్ లో డ్రగ్స్ స్మగ్లింగ్, చోరీలు..పలువురు అరెస్ట్..!!
- January 16, 2025
మస్కట్: ఒమన్ లో పలు కేసుల్లో నిందితులను పోలసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ప్రాంతం నుండి మెటల్ పైపులను దొంగిలించిన నలుగురు వ్యక్తులను ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరో కేసులో జనరల్ డైరెక్టరేట్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్.. 85 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్, హషీష్, గంజాయి, 24వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు విదేశీ పౌరులను పట్టుకుంది.
అదే విధంగా నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీసులు.. లివాలోని విలాయత్లోని వేర్వేరు ప్రదేశాల నుండి రెండు వాహనాలను దొంగిలించిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









