గాజా కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- January 16, 2025
రియాద్: గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఒప్పందాన్ని సులభతరం చేయడంలో ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు ముగింపు పలకాలని, గాజా స్ట్రిప్ తోసహా అన్ని పాలస్తీనా, అరబ్ భూభాగాల నుండి ఇజ్రాయెల్ తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది. పాలస్తీనా ప్రజల హక్కులకు, ప్రత్యేకించి తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే వారి హక్కుకు ఇది మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 45వేలమందికి పైగా మరణించగా, 100,000 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







