ఘనంగా యార్లగడ్డ విరచిత 'సమరశీల ధీర వనిత కమలా హారిస్' పుస్తకావిష్కరణ
- January 18, 2025
విశాఖపట్నం: విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు, పద్మ భూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విరచిత *సమరశీల ధీర వనిత కమలా హారిస్* పుస్తకాన్ని విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ రాజన రమణి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ మహిళలు సమాజ పురోగతికి నిత్య నూతనంగా మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. "మహిళలు సమాజ పురోగతికి మూలస్తంభాలు. వారి శాంతియుత నిబద్ధత సమాజాలను పునరుత్థానపరుస్తుంది, ప్రపంచానికి శక్తివంతమైన ఆదర్శంగా నిలుస్తుంది," అని ఆమె పేర్కొన్నారు. *సమరశీల ధీర వనిత కమలా హారిస్* పుస్తకాన్ని తొలి కాపీని ప్రముఖ పారిశ్రామికవేత్త పోర్టు బ్రహ్మానందం స్వీకరించారు. ఆయన పుస్తకంలోని విషయాలను ప్రశంసిస్తూ, మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి, భవిష్యత్తు తరాల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పుస్తక రచన ప్రేరణ గురించి వివరిస్తూ "కమలా హారిస్ ధైర్యం, నిర్ణయం, సమానత్వం కోసం నిబద్ధతను ప్రతిబింబిస్తారు," అని అన్నారు. ఈ పుస్తకం కమలా హారిస్ యొక్క రాజకీయ జీవితాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళల నాయకత్వం, వారి సాంఘిక పరివర్తన పై ఉన్న ప్రభావాన్ని చూడడానికి కూడా అవకాసం కల్పిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం మహిళల సాధికారత, సాంఘిక న్యాయం పై చర్చించే ఒక ఉత్తేజకరమైన వేదికగా నిలుస్తుందని వివరించారు,
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారాలు:
పుస్తకావిష్కరణ అనంతరం ఆచార్య యార్లగడ్డ లోక్ నాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజ సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. ఈ సంస్థ సాంఘిక న్యాయం కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఏడాది జనవరి 18న, ఫౌండేషన్ "ఎన్.టి. రామారావు" వారసత్వాన్ని గుర్తించి, వారి సాంఘిక న్యాయ పోరాటాన్ని పురస్కరించుకుని సమాజం లోని నాయకులను సత్కరిస్తోందన్నారు. ఎన్.టి. రామారావు నాయకత్వం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని, లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ వారసత్వాన్ని కొనసాగించడానికి కృషి చేస్తోందని వైఎల్ పి తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతాబ్దీ ఉత్సవాలు రేపు ముగియబోతున్నాయన్నారు. రాజన రమణి, పోర్టు బ్రహ్మానందం సైతం సాంఘిక మార్పు కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించడం వల్ల సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.
శనివారం సాయంత్రం 6గంటలకు ఆంధ్రా విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నిర్వహించే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







