షార్జా క్రికెట్ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి..
- January 18, 2025
షార్జా: యూఏఈలో డీపీ వరల్డ్ ఐఎల్టీ20 లీగ్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ లీగ్లో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు. షార్జా స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్, షార్జా వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను మెగాస్టార్ చిరంజీవి, ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిసి వీక్షించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో షై హోప్ (83 నాటౌట్; 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
రొవ్మెన్ పావెల్ (28), సికిందర్ రజా (27), బ్రాండన్ మెక్ముల్లెన్ (22) లు రాణించారు. షార్జా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. మిల్లే, ఆదిల్ రషీద్, కరీమ్ జనత్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని షార్జా జట్టు 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (81; 27 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జాన్సన్ చార్లెస్ (37), ల్యూక్ వెల్స్ (31), జేసన్ రాయ్ (26) లు రాణించారు. దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో దుష్మంత చమీర మూడు వికెట్లు తీశాడు.
తాజా వార్తలు
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు









