ఖతార్ లో మొట్టమొదటి ఫ్రోజెన్ ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్ సర్వీస్ ప్రారంభం..!!
- January 18, 2025
దోహా, ఖతార్: హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) డిపార్ట్మెంట్ ఆఫ్ లాబొరేటరీ మెడిసిన్ అండ్ పాథాలజీ (DLMP), ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం ఖతార్ లో మొట్టమొదటి ఫ్రోజెన్ ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్ (PRBC) సర్వీస్ ను ప్రారంభించింది. అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్న రోగులకు, ప్రత్యేక రక్తమార్పిడి అవసరమయ్యే వారికి ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన బ్లడ్ లభ్యతను నిర్ధారిస్తుంది. ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ (PRBCs) అనేది రక్తమార్పిడిలో ఒక ప్రత్యేక రకం బ్లడ్ ప్రొడక్ట్. PRBC లు ఎక్కువగా ఎర్ర రక్త కణాలు. ఇవి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ సాయంతో శరీరమంతా ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి. ఫ్రోజెన్ PRBC లను తయారు చేయడానికి రక్తంలోని ప్లాస్మా, ఇతర భాగాలను తొలగిస్తారు. ఈ విధానంలో అవి 30 సంవత్సరాల వరకు చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయవచ్చు. ఈ ఫ్రోజెన్ యూనిట్లు 37 ° C వద్ద లిక్విడ్ రూపంలోకితీసుకువస్తరు. అనంతరం రక్తమార్పిడి కోసం అందులోని గ్లిసరాల్ ను తొలగిస్తారు. ఈ సర్వీస్ ప్రారంభం రోగుల భద్రత, సంరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు అని DLMP చైర్ డాక్టర్ ఐనాస్ అల్ కువారి అన్నారు.
PRBCలు ఎవరికి అవసరం:
• అరుదైన రక్త రకాలు: Rh-null లేదా బాంబే బ్లడ్ గ్రూపులు వంటి అరుదైన సమలక్షణాలు ఉన్న రోగులకు.
• అరుదైన ప్రతిరోధకాలను కలిగి ఉన్న రోగులు: తీవ్రమైన హెమోలిటిక్ ప్రతిచర్యల ప్రమాదం కారణంగా ప్రామాణిక PRBC యూనిట్లను పొందలేని వ్యక్తుల కోసం.
• క్రిటికల్ బ్లడ్ రకాలను నిల్వ చేయడం: అత్యవసర పరిస్థితుల్లో తరచుగా అవసరమయ్యే O-నెగటివ్ రక్తం వంటివి.
• ఆటోలోగస్ ట్రాన్స్ఫ్యూషన్లు: రోగులు వారి స్వంత రక్తాన్ని భవిష్యత్తులో ఉపయోగం కోసం దానం చేసినప్పుడు, అనుకూలతను నిర్ధారించడం.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!