అబుదాబిలో రెండు పరిశ్రమలపై చర్యలు..కార్యాకలాపాలు సస్పెండ్..!!
- January 24, 2025
యూఏఈ: అబుదాబిలోని రెండు పారిశ్రామిక సౌకర్యాలలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని రక్షించడానికి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నట్లు పర్యావరణ ఏజెన్సీ - అబుదాబి X లో తెలిపింది. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందున వారిలో ఒకదానికి జరిమానా విధించారు. అథారిటీ రెగ్యులర్ తనిఖీల సందర్భంగా.. గాలి నాణ్యత పర్యవేక్షణ నివేదికలలో పేర్కొన్న కాలుష్య స్థాయిలు అనుమతించబడిన పరిమితులను మించిపోయాయని వెల్లడించాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, ప్రకృతిని కాపాడేందుకు అన్ని పారిశ్రామిక సౌకర్యాలు పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో సమన్వయం, సహకారంతో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనేక వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







