గుజరాత్ విశ్వవిద్యాలయం 73వ స్నాతకోత్సవంలో పాల్గొన్నవెంకయ్య నాయుడు
- January 24, 2025
అహ్మదాబాద్: యువతరం ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని, వారి భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేయాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు.
శుక్రవారం వెంకయ్య నాయుడు గుజరాత్ విశ్వవిద్యాలయంలో జరిగిన 73వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
"కష్టపడి పని చేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది.మార్పునకు చోదక శక్తి యువతే. వారి భుజాలపైనే భారతదేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది.అదే సమయంలో దేశ భవిష్యత్తు తో యువత భవిష్యత్తు ముడిపడి ఉంది.మంచి భవిష్యత్తును నిర్మించుకున్న తర్వాత, తమను ఇంతటి వారిని చేసిన సమాజానికి తిరిగి ఇవ్వటం అలవాటు చేసుకోవాలి." అని చెప్పారు
"విజ్ఞానమే అసలైన సంపద.మీ భవిష్యత్తు మీరు సంపాదించుకునే విజ్ఞాన సంపదపైనే నిర్మితమవుతుంది.దేశ నిర్మాణంలో విద్య పాత్ర చాలా కీలకం." అని చెప్పారు.
" దేశ జనాభాలో 50 శాతం 30 ఏళ్ల లోపు వారే. 35 ఏళ్ల లోపు వారు 65 శాతానికి పైగా ఉన్నారు. ఇది మన బలం.ఎక్కువ మంది మానవ వనరులతో ప్రపంచానికి మన దేశం ప్రతిభావంతుల కర్మాగారం కాబోతోంది.యువతరం ప్రతిభను, వారి శక్తిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగితే భారత్ త్వరలోనే మరింత శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుంది. ఇందుకు కీలకమైన ప్రేరకం విద్య." అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు.
నాణ్యమైన విద్య అందరికీ సమానంగా అందాలని వెంకయ్య నాయుడు చెప్పారు. పేదలకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్యను వారు భరించగలిగే రుసుములకే అందించాలని స్పష్టం చేశారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దార్శనికతకు అనుగుణంగా సామాజికంగా,ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి కూడా విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నారు.
వ్యక్తిత్వ వికాసంలో శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. రోజువారి జీవితంలో యోగ, వ్యాయామాలను భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండాలని విద్యార్థులకు సూచించారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు, మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లను వదిలి భారతీయ సంప్రదాయ వంటకాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గుజరాత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ్ గుప్తా తదితరులు పాల్గొని ప్రసంగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







