తిరుపతి ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి పరిహారం చెల్లింపు
- January 24, 2025
తిరుపతి: తిరుపతిలో జనవరి 8వ తేదీ జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు శుక్రవారం అందజేశారు.
పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్,రామ్మూర్తి,శాంతారాం,కృష్ణమూర్తి అందజేశారు.
టిటిడి పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు.
బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టిటిడి బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







