తిరుపతి ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి పరిహారం చెల్లింపు

- January 24, 2025 , by Maagulf
తిరుపతి ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి పరిహారం చెల్లింపు

తిరుపతి: తిరుపతిలో జనవరి 8వ తేదీ జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు శుక్రవారం అందజేశారు. 

పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్,రామ్మూర్తి,శాంతారాం,కృష్ణమూర్తి అందజేశారు. 

టిటిడి పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు. 

బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టిటిడి బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com