నలుగురు ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసిన హమాస్
- January 25, 2025
గాజాలో 15 నెలల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దాదాపు 200 మంది పాలస్తీనా ఖైదీలను బదులుగా, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ శనివారం నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసింది. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ మరియు లిరి అల్బాగ్లను గాజాలోని రెడ్క్రాస్కు అప్పగించారు. అక్కడి నుండి వారిని ఇజ్రాయెల్ సైనిక దళాలకు అప్పగించారు. హమాస్ చేతిలో బందీగా ఉన్న అర్బెల్ యెహౌద్ను కూడా విడుదల చేయాల్సి ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.ఆమెకు విముక్తి లభించే వరకు పాలస్తీనియన్లు ఉత్తర గాజాకు తిరిగి రావడాన్ని ఇజ్రాయెల్ అనుమతించదని అన్నారు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జనవరి 19న కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి ఇది రెండో మార్పిడి. మొదటి మార్పిడిలో 90 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులను అప్పగించింది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం, మిలిటెంట్లు 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలను గాజాకు తిరిగి తీసుకువెళ్లారు.అప్పటి నుండి, గాజాలో 47,000 మందికి పైగా పాలస్తీనియన్లు చంపబడ్డారని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







