వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!
- January 29, 2025
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వాహన డ్రైవర్లపై ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం తెలిపింది. ఇందుకు దేశవ్యాప్తంగా కొత్త తరం ఏఐతో పనిచేసే ట్రాఫిక్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అధునాతన కెమెరాలు, అధిక-నాణ్యతతో రికార్డు చేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ ఫ్లో తోపాటు డ్రైవర్ ప్రవర్తన సహా రహదారిపై అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు భద్రతా బలగాలకు సహాయపడతాయని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, ఈ కెమెరాలు 40వేల సీట్ బెల్ట్, హ్యాండ్-హెల్డ్ ఫోన్ ఉల్లంఘనలను రికార్డ్ చేశాయని వివరించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







