వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!
- January 29, 2025
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వాహన డ్రైవర్లపై ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం తెలిపింది. ఇందుకు దేశవ్యాప్తంగా కొత్త తరం ఏఐతో పనిచేసే ట్రాఫిక్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అధునాతన కెమెరాలు, అధిక-నాణ్యతతో రికార్డు చేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ ఫ్లో తోపాటు డ్రైవర్ ప్రవర్తన సహా రహదారిపై అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు భద్రతా బలగాలకు సహాయపడతాయని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, ఈ కెమెరాలు 40వేల సీట్ బెల్ట్, హ్యాండ్-హెల్డ్ ఫోన్ ఉల్లంఘనలను రికార్డ్ చేశాయని వివరించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







