వాహన డ్రైవర్లపై నిఘాకు కొత్త తరం సీసీ కెమెరాలు సిద్ధం..!!
- January 29, 2025
కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో వాహన డ్రైవర్లపై ప్రత్యేకంగా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ మరియు కార్యకలాపాల విభాగం తెలిపింది. ఇందుకు దేశవ్యాప్తంగా కొత్త తరం ఏఐతో పనిచేసే ట్రాఫిక్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అధునాతన కెమెరాలు, అధిక-నాణ్యతతో రికార్డు చేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ ఫ్లో తోపాటు డ్రైవర్ ప్రవర్తన సహా రహదారిపై అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు భద్రతా బలగాలకు సహాయపడతాయని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే, ఈ కెమెరాలు 40వేల సీట్ బెల్ట్, హ్యాండ్-హెల్డ్ ఫోన్ ఉల్లంఘనలను రికార్డ్ చేశాయని వివరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









