షార్జాలో కొత్త పిగ్మీ జంతు ప్రదర్శనశాల..టిక్కెట్ల ధర Dh20..!!
- January 30, 2025
యూఏఈ: షార్జాలో ఇటీవల ప్రారంభించబడిన పిగ్మీ జంతుప్రదర్శనశాల అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ అల్బినో కంగారూలు, మరుగుజ్జు గుర్రాలతోపాటు అనేక జంతువును ఒకేచోట చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. జంతుప్రదర్శనశాల యజమాని అబ్దుల్లా బింజరాష్ కు జంతువులంటే ఆసక్తి. అందుకే 10 సంవత్సరాల క్రితం కొన్ని జంతువులతో ప్రారంభించారు. మొదట దుబాయ్లో చిన్నగా ప్రారంభామని, తరువాత అజ్మాన్లో, ఐదేళ్ల తర్వాత షార్జాకు వచ్చామని తెలిపారు. ప్రవేశ రుసుము పెద్దలకు Dh20, పిల్లలకు Dh15గా నిర్ణయించారు. ఒక రోజును ఆస్వాదించేందుకు అన్ని కుటుంబాలకు జూను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అబ్దుల్లా తెలిపారు.
పిగ్మీ జంతుప్రదర్శనశాల ప్రతి విభాగంలో 15 నుండి 16 రకాల జంతువులను కలిగి ఉందని, విభిన్న మండలాల్లో వివిధ రకాల అరుదైన జాతులను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. జంతుప్రదర్శనశాల ప్రతిరోజూ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







