బహ్రెయిన్ లో ఫోన్ దొంగల కోసం కఠినమైన శిక్షలు..!!
- February 01, 2025
మనామా: స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా టాబ్లెట్లను దొంగిలించే దొంగలకు కఠినమైన జరిమానాలు విధించే విషయంపై షురా కౌన్సిల్ చర్చిస్తుంది. సమస్యను పరిష్కరించడంలో గతంలో జాప్యం జరిగిందని అభిప్రాయపడింది. షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ గతంలో వ్యక్తిగత డేటాతో కూడిన ఈ నేరాలకు పాల్పడే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే సవరణలకు మద్దతు ఇచ్చింది.వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని కలిగి ఉన్న మొబైల్ పరికరాల దొంగతనాన్ని మరింత తీవ్రంగా పరిగణించే శిక్షాస్మృతిలో మార్పులకు కమిటీ మద్దతు తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్టాప్ను దొంగిలించడం తీవ్రమైన దొంగతనంగా పరిగణించనున్నారు. ఇందుకు కనీసం మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుంది.
దొంగ బ్యాంకింగ్ రికార్డులు లేదా ప్రైవేట్ ఫోటోలు వంటి సున్నితమైన డేటాను యాక్సెస్ చేయాలని భావిస్తే, కనీస శిక్ష ఒక సంవత్సరానికి పెరుగుతుంది. నేరం తీవ్రత, వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేయబడిందా అనేదానిపై ఆధారపడి, నేరస్థులకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, BD500 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వక్ఫ్ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత సవరణలకు తమ మద్దతును తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









