ఆహా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో వచ్చేసింది..
- February 01, 2025
రెగ్యులర్ గా కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లు తీసుకొచ్చే ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ వచ్చేస్తుంది.ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది.ఈ షో కు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో మెంటార్స్ గా మానస్, యశ్ మాస్టర్, నటి దీపికా, డ్యాన్సర్ జాను లైరి, మోడల్ ప్రకృతిలు ఉండబోతున్నారు.
నేడు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. అలాగే ఆహా ఓటీటీ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో హోస్ట్ తో పాటు జడ్జీలు, మెంటార్స్, పార్టిసిపెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసారు. మీరు కూడా ప్రోమో చూసేయండి.
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 లాంచ్ ఈవెంట్లో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ..డ్యాన్స్ ఐకాన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 తీసుకొస్తున్నాం.డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు.పంచభూతాల్లాంటి వారి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు అని తెలిపారు.
శేఖర్ మాస్టర్ షూటింగ్స్ ఉండి రాకపోవడంతో వీడియో పంపించారు.ఈ వీడియోలో మాట్లాడుతూ.. మూవీస్ బిజీలో ఉండటం వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోయాను.నేను జడ్జ్ గా చేస్తున్నాను.మేము కూడా సర్ ప్రైజ్ చేసేలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఉంటాయి.ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది అని చెప్పారు.అలాగే ఈ ప్రెస్ మీట్ లో మెంటార్స్ మానస్, జాను లైరి, ప్రకృతి, యశ్ మాస్టర్ లు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







