కట్టుదిట్టమైన భద్రతల తో అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- July 01, 2016
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్రను జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 1,292 మంది యాత్రికులు అమర్నాథ్ బయలుదేరారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పలు ప్రాంతాల నుంచి యాత్రికులను సీఆర్పీఎఫ్ కాన్వాయ్ల్లో భగవత్ నగర్ స్థావరానికి తీసుకొచ్చారు. ఉదయం 5:00 గంటలకు యాత్ర ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.
అమర్నాథ్కి వెళ్లే దక్షిణ కశ్మీరులోని పహల్గామ్, ఈశాన్య సోనా మార్గాల్లో 12,500 మంది పారామిలిటరీ సిబ్బంది, 8,000 మంది రాష్ట్ర పోలీసులను ఏర్పాటుచేశారు. యాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. అమర్నాథ్ మంచు లింగం తొలి దర్శనంలో ఆయన పాల్గొంటారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







