కట్టుదిట్టమైన భద్రతల తో అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- July 01, 2016
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు ప్రారంభమైంది. ఈ యాత్రను జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్సింగ్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 1,292 మంది యాత్రికులు అమర్నాథ్ బయలుదేరారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పలు ప్రాంతాల నుంచి యాత్రికులను సీఆర్పీఎఫ్ కాన్వాయ్ల్లో భగవత్ నగర్ స్థావరానికి తీసుకొచ్చారు. ఉదయం 5:00 గంటలకు యాత్ర ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.
అమర్నాథ్కి వెళ్లే దక్షిణ కశ్మీరులోని పహల్గామ్, ఈశాన్య సోనా మార్గాల్లో 12,500 మంది పారామిలిటరీ సిబ్బంది, 8,000 మంది రాష్ట్ర పోలీసులను ఏర్పాటుచేశారు. యాత్ర ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. అమర్నాథ్ మంచు లింగం తొలి దర్శనంలో ఆయన పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









