యూఏఈ అమ్ములపొదిలో అధునాతన వార్ షిప్..!!
- February 08, 2025
యూఏఈ: అత్యున్నత అంతర్జాతీయ మిలిటరీ స్పెసిఫికేషన్లతో రూపొందించబడిన అత్యాధునిక నౌకాదళ నౌకను షేక్ హమ్దాన్ ప్రారంభించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.ఈ నౌక తన రక్షణ కార్యకలాపాలను బలోపేతం చేయడంతోపాటు సముద్ర భద్రతను మరింత పెంచుతుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. అల్ ఎమారత్ కొర్వెట్ (P111) వైపు రెడ్ కార్పెట్పై నడిచే ఫోటోలు, వీడయోను షేర్ చేశారు.ఈ సందర్భంగా యుద్ధనౌక రూపకల్పన,అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారిని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ప్రశంసించారు.
కొత్త యుద్ధనౌకలో అత్యాధునిక పనోరమిక్ సెన్సార్లు, బ్రేక్ లేని డేటా సేకరణ, ప్రాసెసింగ్ కోసం రూపొందించబడిన అధునాతన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉన్నాయి.ఇది రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, కమ్యూనికేషన్ యాంటెన్నాలతో సహా హై-టెక్ సెన్సార్ సిస్టమ్లను కలిగి ఉంది.ప్రత్యేక వాతావరణ వ్యవస్థలతో పాటు దాని కార్యాచరణ సంసిద్ధతను సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









