ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి: వంశీ రామరాజు
- February 11, 2025
ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి
-- వంశీ రామరాజు
హైదరాబాద్: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘంటసాల గుడిలో హైదరాబాదుకు చెందిన శ్రీ గిరి రాగ స్రవంతి వారి' గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భముగా మానవుడే మహనీయుడ -తెలుగు పాటకు పట్టాభిషేకం' అనే పేరు తో సినీ సంగీత కార్యక్రమాన్ని సమర్పించారు.గాయనీగాయకులు రామకృష్ణ,శ్రీకాంత్ ,నాగభూషణం,ఇందునయిన, వీణ ఘంటసాల పడిన అనేక చిత్రాలలోని పాటలతో వీనులవిందు చేశారు.ఈ సందర్భముగా ఘంటసాల గుడి ధర్మకర్త కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ 'ఘంటసాల నిర్యాణం చెంది 51 సంవత్సరాలు దాటినా వారి పాటలు అజరామరంగా ఉన్నాయనీ, భారత ప్రభుత్వం వారికి 'భారత రత్న' పురస్కారం ఇచ్చి గౌరవించవలసిందని అన్నారు.ముఖ్యఅతిధిగా పి.వంశీ కృష్ణ, భారతీయ జనతా పార్టీ , సిటీ ఈసీ మెంబెర్ పాల్గొని ఘంటసాల వాగ్గేయకారుడు అని సద్గురువు అని, ఆయన పాట ద్వారా ఎంతోమంది గాయనీగాయకులు కుఉపాధి దొరికింది అని, వారు కీర్తిశేషులై 51 సంవత్సరాలైన వారు పాడిన భగవద్గీత ఎందరినో ప్రభావితం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి సమన్వయం చేసారు.
తాజా వార్తలు
- భగీరథ్ కు 14 రోజుల రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
- మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో..కుదిరిన కీలక డీల్
- కువైట్లో ఘనంగా NRI TDP మహానాడు వేడుకలు
- హోర్ముజ్ లో ఇరాన్ దాడులు..ఐఎంఓ అధిపతితో లానా నుస్సేబే చర్చలు..!!
- 19 భాషలు, 1,300 డిజిటల్ సేవలతో యాత్రికులకు మద్దతు ..!!
- మార్కెట్లో నకిలీ వస్తువులు..వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం!!
- 2026-2027 రెసిడెన్సీ ప్రోగ్రామ్..దరఖాస్తులకు ఆహ్వానం..!!
- ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు కార్లలో నిద్రపోవద్దు..అలెర్ట్ జారీ..!!
- సురక్షితమైన భోజనం, ఆహార తయారీ పై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్..!!
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?









