ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి: వంశీ రామరాజు
- February 11, 2025
ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి
-- వంశీ రామరాజు
హైదరాబాద్: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘంటసాల గుడిలో హైదరాబాదుకు చెందిన శ్రీ గిరి రాగ స్రవంతి వారి' గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భముగా మానవుడే మహనీయుడ -తెలుగు పాటకు పట్టాభిషేకం' అనే పేరు తో సినీ సంగీత కార్యక్రమాన్ని సమర్పించారు.గాయనీగాయకులు రామకృష్ణ,శ్రీకాంత్ ,నాగభూషణం,ఇందునయిన, వీణ ఘంటసాల పడిన అనేక చిత్రాలలోని పాటలతో వీనులవిందు చేశారు.ఈ సందర్భముగా ఘంటసాల గుడి ధర్మకర్త కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ 'ఘంటసాల నిర్యాణం చెంది 51 సంవత్సరాలు దాటినా వారి పాటలు అజరామరంగా ఉన్నాయనీ, భారత ప్రభుత్వం వారికి 'భారత రత్న' పురస్కారం ఇచ్చి గౌరవించవలసిందని అన్నారు.ముఖ్యఅతిధిగా పి.వంశీ కృష్ణ, భారతీయ జనతా పార్టీ , సిటీ ఈసీ మెంబెర్ పాల్గొని ఘంటసాల వాగ్గేయకారుడు అని సద్గురువు అని, ఆయన పాట ద్వారా ఎంతోమంది గాయనీగాయకులు కుఉపాధి దొరికింది అని, వారు కీర్తిశేషులై 51 సంవత్సరాలైన వారు పాడిన భగవద్గీత ఎందరినో ప్రభావితం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి సమన్వయం చేసారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







