ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి: వంశీ రామరాజు
- February 11, 2025
ఘంటసాలకు భారత రత్నఇవ్వాలి
-- వంశీ రామరాజు
హైదరాబాద్: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘంటసాల గుడిలో హైదరాబాదుకు చెందిన శ్రీ గిరి రాగ స్రవంతి వారి' గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భముగా మానవుడే మహనీయుడ -తెలుగు పాటకు పట్టాభిషేకం' అనే పేరు తో సినీ సంగీత కార్యక్రమాన్ని సమర్పించారు.గాయనీగాయకులు రామకృష్ణ,శ్రీకాంత్ ,నాగభూషణం,ఇందునయిన, వీణ ఘంటసాల పడిన అనేక చిత్రాలలోని పాటలతో వీనులవిందు చేశారు.ఈ సందర్భముగా ఘంటసాల గుడి ధర్మకర్త కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ 'ఘంటసాల నిర్యాణం చెంది 51 సంవత్సరాలు దాటినా వారి పాటలు అజరామరంగా ఉన్నాయనీ, భారత ప్రభుత్వం వారికి 'భారత రత్న' పురస్కారం ఇచ్చి గౌరవించవలసిందని అన్నారు.ముఖ్యఅతిధిగా పి.వంశీ కృష్ణ, భారతీయ జనతా పార్టీ , సిటీ ఈసీ మెంబెర్ పాల్గొని ఘంటసాల వాగ్గేయకారుడు అని సద్గురువు అని, ఆయన పాట ద్వారా ఎంతోమంది గాయనీగాయకులు కుఉపాధి దొరికింది అని, వారు కీర్తిశేషులై 51 సంవత్సరాలైన వారు పాడిన భగవద్గీత ఎందరినో ప్రభావితం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి సమన్వయం చేసారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







