2,234 లేబర్‌ సంబంధిత ఫిర్యాదులు

- July 01, 2016 , by Maagulf
2,234 లేబర్‌ సంబంధిత ఫిర్యాదులు

ఇండియన్‌ ఎంబసీ, నెలవారీగా నిర్వహించే ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. కాన్సులర్‌ సమస్యలను, ఇతరత్రా సమస్యల గురించి ఒనైజాలో ఈ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం జరిగింది. రాయబారి సంజీవ్‌ అరోరా, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఆర్‌కె సింగ్‌ సహా పలువురు వ్రముఖులు తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అలాగే ఫిర్యాదులు చేసినవారితో మాట్లాడారు. ఆయా కేసుల్ని ఎంబసీ ఫాలో అప్‌ చేఉ్తందని తెలిపారు. ఇండియన్‌ కమ్యూనిటీ బెనెవోలెంట్‌ ఫోరమ్‌ (ఐసిబిఎఫ్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ బేబీ కెరియన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబసీ టీమ్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ని సందర్శించింది. సెంట్రల్‌ ప్రిజన్‌ - డిపోర్టేషన్‌ సెంటర్‌లో 129 మరియు 98 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 2,234 ఫిర్యాదుల్ని లేబర్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెక్షన్‌ అందుకుంది. 2015లో ఈ సంఖ్య 4,132గా ఉంది. ఇదిలా ఉండగా ఐసిబిఎఫ్‌, కార్మికులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తోంది. విమాన టిక్కెట్లు అందించడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com