2,234 లేబర్ సంబంధిత ఫిర్యాదులు
- July 01, 2016
ఇండియన్ ఎంబసీ, నెలవారీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. కాన్సులర్ సమస్యలను, ఇతరత్రా సమస్యల గురించి ఒనైజాలో ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ సహా పలువురు వ్రముఖులు తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అలాగే ఫిర్యాదులు చేసినవారితో మాట్లాడారు. ఆయా కేసుల్ని ఎంబసీ ఫాలో అప్ చేఉ్తందని తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) వైస్ ప్రెసిడెంట్ బేబీ కెరియన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబసీ టీమ్ సెంట్రల్ ప్రిజన్ని సందర్శించింది. సెంట్రల్ ప్రిజన్ - డిపోర్టేషన్ సెంటర్లో 129 మరియు 98 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 2,234 ఫిర్యాదుల్ని లేబర్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ అందుకుంది. 2015లో ఈ సంఖ్య 4,132గా ఉంది. ఇదిలా ఉండగా ఐసిబిఎఫ్, కార్మికులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తోంది. విమాన టిక్కెట్లు అందించడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







