ఉగ్రవాదాన్ని అణిచివేతకు కృషిచేస్తాం: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
- July 02, 2016
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఇది తీవ్రమైన దుశ్చర్యగా ఆమె పరిగణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి మతమనేదే లేదని.. వారిని ప్రజలు అడ్డుకోవాలని హసీనా అన్నారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఢాకాలోని గుల్షన్లో ఓ రెస్టారెంట్పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్లోకి చొరబడి ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో భద్రతాబలగాలు చుట్టుముట్టి ఉగ్రవాదులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను సురక్షితంగా విడిపించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









