ఉగ్రవాదాన్ని అణిచివేతకు కృషిచేస్తాం: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా

- July 02, 2016 , by Maagulf
ఉగ్రవాదాన్ని అణిచివేతకు కృషిచేస్తాం: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఖండించారు. ఇది తీవ్రమైన దుశ్చర్యగా ఆమె పరిగణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి మతమనేదే లేదని.. వారిని ప్రజలు అడ్డుకోవాలని హసీనా అన్నారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఢాకాలోని గుల్షన్‌లో ఓ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్‌లోకి చొరబడి ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో భద్రతాబలగాలు చుట్టుముట్టి ఉగ్రవాదులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను సురక్షితంగా విడిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com