ఉగ్రవాదాన్ని అణిచివేతకు కృషిచేస్తాం: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
- July 02, 2016
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఇది తీవ్రమైన దుశ్చర్యగా ఆమె పరిగణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి మతమనేదే లేదని.. వారిని ప్రజలు అడ్డుకోవాలని హసీనా అన్నారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఢాకాలోని గుల్షన్లో ఓ రెస్టారెంట్పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్లోకి చొరబడి ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో భద్రతాబలగాలు చుట్టుముట్టి ఉగ్రవాదులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను సురక్షితంగా విడిపించారు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







