ఒమన్ లో సోషల్ మీడియాను ఎదుర్కోవడంపై వర్క్ షాప్..!!
- February 14, 2025
మస్కట్: సమాచార మంత్రిత్వ శాఖ "సోషల్ మీడియాతో వ్యవహరించడానికి జాతీయ ఫ్రేమ్వర్క్ వైపు" అనే అంశంతో వర్క్షాప్ను నిర్వహించనుంది. రెండు వారాల వర్క్షాప్ ఫిబ్రవరి 16న “ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్” సంబంధిత ఇతర విభాగాల సహకారంతో నిర్వహించబడుతుంది. సోషల్ మీడియా వాతావరణంలో పిల్లల పెంపకం పట్ల కుటుంబం , సమాజం బాధ్యతపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సూచనలు నేపథ్యంలో వర్క్షాప్ ను నిర్వహించాలని నిర్ణయించారు.
సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU), నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) సహకారంతో సంబంధిత పరిశోధన/అధ్యయనాలను సిద్ధం చేయడంలో విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, మీడియా నిపుణులు ఈ వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ.. ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ , సంబంధిత విభాగాలకు చెందిన బృందం ఒమన్ విజన్ 2040 ప్రాధాన్యతలకు ఎదురయ్యే స్మార్ట్ లక్ష్యాలు, అల్గారిథమ్లు, సవాళ్లతో కూడిన వ్యూహాత్మక విధానాన్ని అభివృద్ధి చేసింది. సోషల్ మీడియా సానుకూల అంశాలను మెరుగుపరచడానికి, సమాజంపై ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి సంబంధిత అధికారులచే అమలు చేయబడే అనేక కార్యక్రమాలలో భాగంగా వర్క్షాప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







