ఒమన్ లో సోషల్ మీడియాను ఎదుర్కోవడంపై వర్క్ షాప్..!!
- February 14, 2025
మస్కట్: సమాచార మంత్రిత్వ శాఖ "సోషల్ మీడియాతో వ్యవహరించడానికి జాతీయ ఫ్రేమ్వర్క్ వైపు" అనే అంశంతో వర్క్షాప్ను నిర్వహించనుంది. రెండు వారాల వర్క్షాప్ ఫిబ్రవరి 16న “ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్” సంబంధిత ఇతర విభాగాల సహకారంతో నిర్వహించబడుతుంది. సోషల్ మీడియా వాతావరణంలో పిల్లల పెంపకం పట్ల కుటుంబం , సమాజం బాధ్యతపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సూచనలు నేపథ్యంలో వర్క్షాప్ ను నిర్వహించాలని నిర్ణయించారు.
సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU), నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) సహకారంతో సంబంధిత పరిశోధన/అధ్యయనాలను సిద్ధం చేయడంలో విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, మీడియా నిపుణులు ఈ వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ.. ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ , సంబంధిత విభాగాలకు చెందిన బృందం ఒమన్ విజన్ 2040 ప్రాధాన్యతలకు ఎదురయ్యే స్మార్ట్ లక్ష్యాలు, అల్గారిథమ్లు, సవాళ్లతో కూడిన వ్యూహాత్మక విధానాన్ని అభివృద్ధి చేసింది. సోషల్ మీడియా సానుకూల అంశాలను మెరుగుపరచడానికి, సమాజంపై ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి సంబంధిత అధికారులచే అమలు చేయబడే అనేక కార్యక్రమాలలో భాగంగా వర్క్షాప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









