ఒమన్ లో సోషల్ మీడియాను ఎదుర్కోవడంపై వర్క్ షాప్..!!
- February 14, 2025
మస్కట్: సమాచార మంత్రిత్వ శాఖ "సోషల్ మీడియాతో వ్యవహరించడానికి జాతీయ ఫ్రేమ్వర్క్ వైపు" అనే అంశంతో వర్క్షాప్ను నిర్వహించనుంది. రెండు వారాల వర్క్షాప్ ఫిబ్రవరి 16న “ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్” సంబంధిత ఇతర విభాగాల సహకారంతో నిర్వహించబడుతుంది. సోషల్ మీడియా వాతావరణంలో పిల్లల పెంపకం పట్ల కుటుంబం , సమాజం బాధ్యతపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సూచనలు నేపథ్యంలో వర్క్షాప్ ను నిర్వహించాలని నిర్ణయించారు.
సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU), నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) సహకారంతో సంబంధిత పరిశోధన/అధ్యయనాలను సిద్ధం చేయడంలో విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, మీడియా నిపుణులు ఈ వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ.. ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ , సంబంధిత విభాగాలకు చెందిన బృందం ఒమన్ విజన్ 2040 ప్రాధాన్యతలకు ఎదురయ్యే స్మార్ట్ లక్ష్యాలు, అల్గారిథమ్లు, సవాళ్లతో కూడిన వ్యూహాత్మక విధానాన్ని అభివృద్ధి చేసింది. సోషల్ మీడియా సానుకూల అంశాలను మెరుగుపరచడానికి, సమాజంపై ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి సంబంధిత అధికారులచే అమలు చేయబడే అనేక కార్యక్రమాలలో భాగంగా వర్క్షాప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







