వెటర్నరీ ఉల్లంఘనలకు Dh500,000 వరకు జరిమానా..!!
- February 15, 2025
యూఏఈ: పశువైద్య ఉల్లంఘనలపై అజ్మాన్ మునిసిపాలిటీ కఠినంగా వ్యవహారించనుంది. ఎమిరేట్లోని వెటర్నరీ ప్రత్యేక కంపెనీల ద్వారా గడువు ముగిసిన వెటర్నరీ ఉత్పత్తులను సురక్షితంగా పారవేసేందుకు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అజ్మాన్ మునిసిపాలిటీ.. వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) సహకారంతో నియంత్రణ సమ్మతి, పర్యావరణ భద్రత ప్రాముఖ్యతను తెలియజేసింది. వెటర్నరీ ఉత్పత్తులపై నిర్దేశిత ఉల్లంఘనలకు కఠినంగా చర్యలు ఉంటాయని అజ్మాన్లోని పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఖలీద్ మొయీన్ అల్ హోసానీ హెచ్చరించారు. క్లినిక్లు, ఫార్మసీలతో సహా పశువైద్య సౌకర్యాలను తరచూ తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆన్-కాల్ పశువైద్యుల కోసం వెటర్నరీ సేవలను ప్రాక్టీస్ చేయడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందాలని సూచించారు. అజ్మాన్ మునిసిపాలిటీ నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠినమైన జరిమానాలు తప్పవని హెచ్చరించారు.Dh10,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. దాంతోపాటు నాన్-కంప్లైంట్ వెటర్నరీ ఉత్పత్తుల జప్తు చేయడంతోపాటు ఉల్లంఘనలు పునరావృతమైతే కార్యకలాపాల సస్పెన్షన్ లేదా సౌకర్యాల మూసివేత ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







