వెటర్నరీ ఉల్లంఘనలకు Dh500,000 వరకు జరిమానా..!!
- February 15, 2025
యూఏఈ: పశువైద్య ఉల్లంఘనలపై అజ్మాన్ మునిసిపాలిటీ కఠినంగా వ్యవహారించనుంది. ఎమిరేట్లోని వెటర్నరీ ప్రత్యేక కంపెనీల ద్వారా గడువు ముగిసిన వెటర్నరీ ఉత్పత్తులను సురక్షితంగా పారవేసేందుకు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అజ్మాన్ మునిసిపాలిటీ.. వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) సహకారంతో నియంత్రణ సమ్మతి, పర్యావరణ భద్రత ప్రాముఖ్యతను తెలియజేసింది. వెటర్నరీ ఉత్పత్తులపై నిర్దేశిత ఉల్లంఘనలకు కఠినంగా చర్యలు ఉంటాయని అజ్మాన్లోని పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఖలీద్ మొయీన్ అల్ హోసానీ హెచ్చరించారు. క్లినిక్లు, ఫార్మసీలతో సహా పశువైద్య సౌకర్యాలను తరచూ తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆన్-కాల్ పశువైద్యుల కోసం వెటర్నరీ సేవలను ప్రాక్టీస్ చేయడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందాలని సూచించారు. అజ్మాన్ మునిసిపాలిటీ నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠినమైన జరిమానాలు తప్పవని హెచ్చరించారు.Dh10,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. దాంతోపాటు నాన్-కంప్లైంట్ వెటర్నరీ ఉత్పత్తుల జప్తు చేయడంతోపాటు ఉల్లంఘనలు పునరావృతమైతే కార్యకలాపాల సస్పెన్షన్ లేదా సౌకర్యాల మూసివేత ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







