ముస్లింలందరూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
- July 02, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని అన్నారు. ముస్లింలందరూ ఐసిస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇస్లాం మేధావులు వారి ఘటనలను ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, ఏదో ఒక వర్గానికి చెందినంత మాత్రాన ఒక ముద్ర వేసేయడం సరికాదని అసద్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేసిన వారికి న్యాయస్థానం న్యాయం చేస్తుందన్నారు. న్యాయసాయం చేస్తానని కూడా అన్నారు. వారు నేరం చేసినట్లైతే కోర్టులు శిక్షిస్తాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







