ముస్లింలందరూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు: అసదుద్దీన్ ఓవైసీ
- July 02, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని అన్నారు. ముస్లింలందరూ ఐసిస్ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇస్లాం మేధావులు వారి ఘటనలను ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, ఏదో ఒక వర్గానికి చెందినంత మాత్రాన ఒక ముద్ర వేసేయడం సరికాదని అసద్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేసిన వారికి న్యాయస్థానం న్యాయం చేస్తుందన్నారు. న్యాయసాయం చేస్తానని కూడా అన్నారు. వారు నేరం చేసినట్లైతే కోర్టులు శిక్షిస్తాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









