చైనీస్ హ్యాకింగ్ ముఠాకు విజిట్ వీసాలు..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- February 16, 2025
కువైట్:సైబర్ దాడి ముఠాలోని 6 మంది చైనా అనుమానితులకు వ్యాపార విజిట్ వీసాలు అందించిన ఒక కువైట్ పౌరుడు, ఈజిప్షియన్ ప్రవాసిని అధికారులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులలో నలుగురు వ్యక్తులు ముందే దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. కువైట్ గత రోజు కమ్యూనికేషన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని కువైట్లో సైబర్ దాడికి ప్లాన్ చేస్తున్న ఒక చైనా జాతీయుడి ముఠాను అరెస్టు చేసింది.
అధికారిక నివేదిక ప్రకారం.. పౌరుడు, ఈజిప్షియన్ ప్రతి ఎంట్రీ వీసాకు 100 దినార్లు అందుకున్నట్లు అంగీకరించారు. జనవరి చివరి వారంలో ఈ ముఠా దేశంలోకి ప్రవేశించింది. ఆ ఆపరేషన్ కోసం వాహనాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హ్యాకింగ్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇంతలో, ముఠా సభ్యులు ఉపయోగించిన హ్యాకింగ్ పరికరాలను ఎలా తీసుకువచ్చారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. అయితే, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్కు గురైన పౌరులు, నివాసితులు భద్రతా అధికారులకు అధికారిక నివేదికలను సమర్పించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









