మక్కా తొక్కిసలాటలో 18 మందికి గాయాలు

- July 02, 2016 , by Maagulf
మక్కా తొక్కిసలాటలో 18 మందికి గాయాలు

ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. రంజాన్‌ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్భంగా నిన్న రాత్రి ప్రార్థనల కోసం మక్కా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఏఐ-రియాద్‌ న్యూస్‌ఏజెన్సీ తెలిపింది. గాయపడిన వారందరికీ వెంటనే ప్రాథమిక చికిత్స అందించారని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. మక్కాకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్తుంటారు. రంజాన్‌ మాసం సందర్భంగా యాత్రికులు మరింత ఎక్కువయ్యారు. .
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న హజ్‌ యాత్ర కోసం సౌదీ అరేబియా ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది హజ్‌ యాత్ర పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. యాత్రికుల మధ్య తొక్కిసలాట జరిగి 2,297 మంది మృతిచెందారు. అయితే సౌదీ అరేబియా మాత్రం 769 మంది చనిపోయినట్లు ప్రకటించింది. గత ఏడాది దుర్ఘటన దృష్ట్యా భద్రత మరింత పెంచాలని సౌదీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com