మక్కా తొక్కిసలాటలో 18 మందికి గాయాలు
- July 02, 2016
ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్భంగా నిన్న రాత్రి ప్రార్థనల కోసం మక్కా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఏఐ-రియాద్ న్యూస్ఏజెన్సీ తెలిపింది. గాయపడిన వారందరికీ వెంటనే ప్రాథమిక చికిత్స అందించారని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. మక్కాకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్తుంటారు. రంజాన్ మాసం సందర్భంగా యాత్రికులు మరింత ఎక్కువయ్యారు. .
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది హజ్ యాత్ర పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. యాత్రికుల మధ్య తొక్కిసలాట జరిగి 2,297 మంది మృతిచెందారు. అయితే సౌదీ అరేబియా మాత్రం 769 మంది చనిపోయినట్లు ప్రకటించింది. గత ఏడాది దుర్ఘటన దృష్ట్యా భద్రత మరింత పెంచాలని సౌదీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









