మక్కా తొక్కిసలాటలో 18 మందికి గాయాలు
- July 02, 2016
ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్భంగా నిన్న రాత్రి ప్రార్థనల కోసం మక్కా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఏఐ-రియాద్ న్యూస్ఏజెన్సీ తెలిపింది. గాయపడిన వారందరికీ వెంటనే ప్రాథమిక చికిత్స అందించారని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. మక్కాకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్తుంటారు. రంజాన్ మాసం సందర్భంగా యాత్రికులు మరింత ఎక్కువయ్యారు. .
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది హజ్ యాత్ర పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. యాత్రికుల మధ్య తొక్కిసలాట జరిగి 2,297 మంది మృతిచెందారు. అయితే సౌదీ అరేబియా మాత్రం 769 మంది చనిపోయినట్లు ప్రకటించింది. గత ఏడాది దుర్ఘటన దృష్ట్యా భద్రత మరింత పెంచాలని సౌదీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







