మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు
- February 17, 2025
అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యాయి. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ తరపున ప్రకటన రిలీజ్ చేశారు.
అదే రోజున పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో దీనిపై పార్టీ నేతల స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రాండ్ సక్సెస్ చేసేలా కసరత్తు చేస్తున్నారు.
పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఈసారి పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయబావుటా ఎగురవేసింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







