అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- March 03, 2026
దోహా: ఎయిర్ స్పేస్ మూసివేతతో చిక్కుకుపోయిన వారికి ఖతార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.గడువు ముగిసిన లేదా గడువు ముగియబోతున్న అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆమోదించబడిన ఎలక్ట్రానిక్ సిస్టమ్ల ద్వారా పొడిగింపు ఆటోమెటిక్ గా ప్రాసెస్ అవుతుందని తెలిపింది. అలాగే, దరఖాస్తు ఫీజులకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఫిబ్రవరి 28కి ముందు ఉల్లంఘనలకు గురైన అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలకు సంబంధించి, సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది.
>ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండాలని, తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే బయటకు రావాలని కోరింది. కిటికీలు మరియు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజా భద్రతను కాపాడటానికి సమర్థ అధికారులు జారీ చేసిన అధికారిక సూచనలను పాటించాలని కోరింది. ఏవైనా అప్డేట్ కోసం మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









