అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- March 03, 2026
దోహా: ఎయిర్ స్పేస్ మూసివేతతో చిక్కుకుపోయిన వారికి ఖతార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.గడువు ముగిసిన లేదా గడువు ముగియబోతున్న అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆమోదించబడిన ఎలక్ట్రానిక్ సిస్టమ్ల ద్వారా పొడిగింపు ఆటోమెటిక్ గా ప్రాసెస్ అవుతుందని తెలిపింది. అలాగే, దరఖాస్తు ఫీజులకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఫిబ్రవరి 28కి ముందు ఉల్లంఘనలకు గురైన అన్ని కేటగిరీల ఎంట్రీ వీసాలకు సంబంధించి, సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది.
>ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండాలని, తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే బయటకు రావాలని కోరింది. కిటికీలు మరియు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజా భద్రతను కాపాడటానికి సమర్థ అధికారులు జారీ చేసిన అధికారిక సూచనలను పాటించాలని కోరింది. ఏవైనా అప్డేట్ కోసం మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







