ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- March 03, 2026
మస్కట్: ఒమాన్ లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్లో ఉన్న ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని డ్రోన్లు దాడి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నట్లు Oman News Agency (ONA) ఒక భద్రతా వర్గాన్ని ఉటంకిస్తూ తెలిపింది.
సమాచారం ప్రకారం, డ్రోన్లలో ఒకటి ఇంధన ట్యాంకును నేరుగా తాకినట్లు పేర్కొన్నారు. దాంతో స్వల్ప నష్టం సంభవించినప్పటికీ, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఓఎన్ఏ వెల్లడించింది. భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.
పోర్ట్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









