ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- March 03, 2026
మస్కట్: ఒమాన్ లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్లో ఉన్న ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని డ్రోన్లు దాడి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నట్లు Oman News Agency (ONA) ఒక భద్రతా వర్గాన్ని ఉటంకిస్తూ తెలిపింది.
సమాచారం ప్రకారం, డ్రోన్లలో ఒకటి ఇంధన ట్యాంకును నేరుగా తాకినట్లు పేర్కొన్నారు. దాంతో స్వల్ప నష్టం సంభవించినప్పటికీ, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఓఎన్ఏ వెల్లడించింది. భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.
పోర్ట్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









