ఒమాన్‌లోని డుక్మ్ పోర్ట్‌ పై డ్రోన్ దాడి

- March 03, 2026 , by Maagulf
ఒమాన్‌లోని డుక్మ్ పోర్ట్‌ పై డ్రోన్ దాడి

మస్కట్: ఒమాన్ లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్‌లో ఉన్న ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని డ్రోన్లు దాడి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నట్లు Oman News Agency (ONA) ఒక భద్రతా వర్గాన్ని ఉటంకిస్తూ తెలిపింది.

సమాచారం ప్రకారం, డ్రోన్లలో ఒకటి ఇంధన ట్యాంకును నేరుగా తాకినట్లు పేర్కొన్నారు. దాంతో స్వల్ప నష్టం సంభవించినప్పటికీ, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఓఎన్ఏ వెల్లడించింది. భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.

పోర్ట్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com