ఎత్తైన దుబాయ్ మెరీనా నివాస భవనంలో అగ్నిప్రమాదం..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ టవర్లో సోమవారం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. భవనం పైకప్పుపై ఉన్న ఎయిర్ కండిషనింగ్ కూలర్లలో మంటలు చెలరేగాయని అధికార యంత్రాంగం పేర్కొంది. ఎత్తైన టవర్ పై నుండి పొగలు వస్తున్నట్లు సోషల్ మీడియాలోని షేర్ అవుతున్నాయి.
మెరీనాలో నివసించే దుబాయ్ నివాసి MA, సంఘటన జరిగిన సమయంలో మధ్యాహ్నం సమయంలో పోలీసు సైరన్ల శబ్దం వినిపించిందని చెప్పారు. ఆన్లైన్లో షేర్ చేయబడిన ఒక వీడియో మెట్రో స్టేషన్కు సమీపంలో ఉన్న టవర్ నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు కనిపించింది.
మధ్యాహ్నం 12:20 గంటలకు ఘటన జరిగిన ఐదు నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే తరలింపు, అగ్నిమాపక కార్యకలాపాలను ప్రారంభించారు. వారు మధ్యాహ్నం 12:44 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









