హైదరాబాద్ లో ఘనంగా 'పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం
- February 21, 2025
హైదరాబాద్: విఖ్యాత గాయకులు ఘంటసాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు భాష కు వన్నె తెచ్చాయి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.వారి పాటలో మాధుర్యం మాత్రమే కాక తెలుగు భాష ఉచ్చారణ భాష లోని అందం శ్రోతలకు అందించిందని అయన పేర్కొన్నారు.అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ సందర్భంలో వీరి పాటలు ఎంపిక చేసుకోవటం సముచితంగా ఉందన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో ప్రముఖ గాయకుడు దాసరి శ్రీహరి సారథ్యంలో పాటకు పట్టాభిషేకం పేరిట ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను వై.ఎస్ రామకృష్ణ ఇందునయన సురేఖ మధురంగా ఆలపించారు.శ్రీ హరి సహా గాయకులతో కలసి ఆలపించి వాడిన పూలే వికసించేనే పాటను సుమధుర స్వరంతో పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ రామరాజు పాల్గొని గాయకులను సత్కరించి మాట్లాడారు నేటి వారికి ఘంటసాల పాటలు వినిపిస్తే తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని చెప్పేరు ఉత్తమ కార్యక్రమాలు చేసే వారికి వంశీ సంస్థల సహకారం అందిస్తామని తెలిపారు.సుధామయి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొనగా లలిత కార్యక్రమ నిర్వహణ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







