హైదరాబాద్ లో ఘనంగా 'పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం
- February 21, 2025
హైదరాబాద్: విఖ్యాత గాయకులు ఘంటసాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు భాష కు వన్నె తెచ్చాయి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.వారి పాటలో మాధుర్యం మాత్రమే కాక తెలుగు భాష ఉచ్చారణ భాష లోని అందం శ్రోతలకు అందించిందని అయన పేర్కొన్నారు.అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ సందర్భంలో వీరి పాటలు ఎంపిక చేసుకోవటం సముచితంగా ఉందన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో ప్రముఖ గాయకుడు దాసరి శ్రీహరి సారథ్యంలో పాటకు పట్టాభిషేకం పేరిట ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను వై.ఎస్ రామకృష్ణ ఇందునయన సురేఖ మధురంగా ఆలపించారు.శ్రీ హరి సహా గాయకులతో కలసి ఆలపించి వాడిన పూలే వికసించేనే పాటను సుమధుర స్వరంతో పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ రామరాజు పాల్గొని గాయకులను సత్కరించి మాట్లాడారు నేటి వారికి ఘంటసాల పాటలు వినిపిస్తే తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని చెప్పేరు ఉత్తమ కార్యక్రమాలు చేసే వారికి వంశీ సంస్థల సహకారం అందిస్తామని తెలిపారు.సుధామయి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొనగా లలిత కార్యక్రమ నిర్వహణ చేశారు.
తాజా వార్తలు
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..
- హైదరాబాద్లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి









