హైదరాబాద్ లో ఘనంగా 'పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం
- February 21, 2025
హైదరాబాద్: విఖ్యాత గాయకులు ఘంటసాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు భాష కు వన్నె తెచ్చాయి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.వారి పాటలో మాధుర్యం మాత్రమే కాక తెలుగు భాష ఉచ్చారణ భాష లోని అందం శ్రోతలకు అందించిందని అయన పేర్కొన్నారు.అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ సందర్భంలో వీరి పాటలు ఎంపిక చేసుకోవటం సముచితంగా ఉందన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో ప్రముఖ గాయకుడు దాసరి శ్రీహరి సారథ్యంలో పాటకు పట్టాభిషేకం పేరిట ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను వై.ఎస్ రామకృష్ణ ఇందునయన సురేఖ మధురంగా ఆలపించారు.శ్రీ హరి సహా గాయకులతో కలసి ఆలపించి వాడిన పూలే వికసించేనే పాటను సుమధుర స్వరంతో పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ రామరాజు పాల్గొని గాయకులను సత్కరించి మాట్లాడారు నేటి వారికి ఘంటసాల పాటలు వినిపిస్తే తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని చెప్పేరు ఉత్తమ కార్యక్రమాలు చేసే వారికి వంశీ సంస్థల సహకారం అందిస్తామని తెలిపారు.సుధామయి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొనగా లలిత కార్యక్రమ నిర్వహణ చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







