అంతర్జాతీయంగా ఆకర్షించిన ఒమన్ మస్కట్ మారథాన్..!!
- February 22, 2025
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం(MHT) ఆధ్వర్యంలో అల్ మౌజ్ మస్కట్లో "ఎక్స్పీరియన్స్ ఒమన్ మస్కట్ మారథాన్ 2025" అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు విదేశాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైన ప్రదేశాల గుండా కొనసాగింది.
మొదటి రోజు పూర్తి 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసును నిర్వహించారు. విజేతలకు హిస్ ఎక్సలెన్సీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి ఈవెంట్లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజం ఆర్థిక ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్లోబల్ ఈవెంట్లు, పోటీలను నిర్వహించే ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్
- హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్ ఎయిర్పోర్ట్స్
- గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- ఇరాన్కు వ్యతిరేకంగా ఉమ్మడి అరబ్ వైఖరి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- 3 రోజుల ఉచిత పార్కింగ్ ప్రకటించిన షార్జా..!!
- షిఫా యాప్ ద్వారా యాత్రికుల కోసం ఐపీఎస్ సేవలు..!!









