తల్లితండ్రుల నిర్లక్ష్యం తో కారులోనే మృతిచెందిన బాలుడు
- July 11, 2015
షార్జా లోని అల్ రామ్సా లో, తల్లితండ్రుల నిర్లక్ష్యం వలన నాలుగు సంవత్సరాల బాలుడు, తన ఇంటిముందు పార్క్ చేసిన కారులోనే మృతిచెందాడు! ఇక్కడి పోలీసువారి కధనం ప్రకారం, కుమారుడితోపాటు ఇంటికి కారులో వచ్చిన తండ్రి, కొడుకు ఇంటిలోకే వెళ్ళాడని పొరబడి, కారు లాక్ చేసి తన విల్లాలోకే వెళ్లిపోవడంతో అధికవేడి, ఊపిరి ఆడకపోవడం వలన ఆపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ణి అల్ క్వసైమీ ఆసుపత్రికి తీసుకువెళ్ళినపుడు, వైద్యులు అతడు మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇలాంటి కేసులు ఒక్క షార్జా లోనే 5 కు పైగా నమోదయ్యాయని వారు తెలిపారు. ఈ కేసులో దుబాయి న్యాయ సంస్థ డైరక్టర్ జమాల్ అల్ సుమైతీ తల్లితండ్రులను దోషులుగా గుర్తించారు; వారికి ఈ నుండి 3 నెలల జైలుశిక్ష పదే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









