కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!

- February 28, 2025 , by Maagulf
కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!

మనామా: కాన్సులర్ ఫీజుల పెంపు పై బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.  కాన్సులర్ సర్వీస్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  వివిధ సేవలకు ఛార్జీలు మారవని, ఎంబసీ కాన్సులర్ ఫీజులపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com