ఏపీ ప్రజలకు కొత్త పథకం..
- February 28, 2025
అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత బడ్జెట్ 2025లో ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోంది.ఏపీ ప్రజల కోసం సరికొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తోంది. నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.అంతేకాదు.. ఈ ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాది నుంచి అమలులోకి రానుందని వెల్లడించారు.ఇందు కోసం ఆరోగ్యశాఖకు రూ.19,264 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
మధ్యతరగతి, పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు.రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను అందించనున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే.. ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉండగా..అంతకన్నా మెరుగైనా వైద్య సేవలను అందించనుందా? అనేది తెలియాల్సి ఉంది.ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు సంబంధించి నియమ నిబంధనల పై ఎలాంటి ప్రకటన చేయలేదు.దాంతో ఎవరెవరు ఇందుకు అర్హులు అనేది స్పష్టత లేదు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!