కొండ చరియలు విరిగి..మంచులో చిక్కుకున్న 57 మంది
- February 28, 2025
బద్రీనాథ్: ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో ఇవాళ ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి.వాటికింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు.బద్రీనాథ్ ధావ్లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్డీఓ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణపనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్డీ క్యాంప్ కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీఆర్ మీనా వెల్లడించారు.ఇందులో 10మందిని రక్షించి క్యాంప్ నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఘటనాస్థలంలో అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు.అయితే, మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ ఓ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









