కొండ చరియలు విరిగి..మంచులో చిక్కుకున్న 57 మంది
- February 28, 2025
బద్రీనాథ్: ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో ఇవాళ ఉదయం మంచు చరియలు విరిగిపడ్డాయి.వాటికింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు.బద్రీనాథ్ ధావ్లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్డీఓ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణపనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్డీ క్యాంప్ కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీఆర్ మీనా వెల్లడించారు.ఇందులో 10మందిని రక్షించి క్యాంప్ నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఘటనాస్థలంలో అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు.అయితే, మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ ఓ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!