ఐదవ రింగ్ రోడ్డులో కొత్త టన్నెల్ ప్రారంభం..!!
- March 02, 2025
కువైట్: దేశంలో రోడ్డు నిర్వహణ పనులు, ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డా. నౌరా అల్-మిషాన్ తెలిపారు. సాల్మియా వైపు నుండి వస్తున్నప్పుడు జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్లో కొత్తగా ప్రారంభించిన టన్నెల్ ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ స్పెసిఫికేషన్లను సాధించడానికి పూర్తి నిబద్ధతతో మంత్రిత్వ శాఖ అన్ని ప్రాంతాలలో రహదారి నిర్వహణ ప్రాజెక్టులను అమలు చేయడం కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
ఐదవ రింగ్ రోడ్లోని ఈ కొత్త టన్నెల్ సౌత్ సుర్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక భాగం. సాల్మియా వైపు టన్నెల్ రెండవ భాగం రాబోయే వారాల్లో పూర్తవుతుంది.గత వారం, ఖైతాన్ బ్రిడ్జీ , ఎయిర్పోర్ట్ రోడ్డు నుండి ఖైతాన్కు వెళ్లే రహదారిని ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అన్ని రహదారులపై నిర్వహణ పనులను ప్రారంభించింది. ట్రాఫిక్ సజావుగా ఉండేలా మరియు రద్దీని నివారించడానికి, రహదారి మూసివేతలు మరియు ఓపెనింగ్లకు సంబంధించి మంత్రిత్వ శాఖ సూచనలను అనుసరించాలని పౌరులు నివాసితులకు మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







