ఐదవ రింగ్ రోడ్డులో కొత్త టన్నెల్ ప్రారంభం..!!
- March 02, 2025
కువైట్: దేశంలో రోడ్డు నిర్వహణ పనులు, ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డా. నౌరా అల్-మిషాన్ తెలిపారు. సాల్మియా వైపు నుండి వస్తున్నప్పుడు జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్లో కొత్తగా ప్రారంభించిన టన్నెల్ ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ స్పెసిఫికేషన్లను సాధించడానికి పూర్తి నిబద్ధతతో మంత్రిత్వ శాఖ అన్ని ప్రాంతాలలో రహదారి నిర్వహణ ప్రాజెక్టులను అమలు చేయడం కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
ఐదవ రింగ్ రోడ్లోని ఈ కొత్త టన్నెల్ సౌత్ సుర్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక భాగం. సాల్మియా వైపు టన్నెల్ రెండవ భాగం రాబోయే వారాల్లో పూర్తవుతుంది.గత వారం, ఖైతాన్ బ్రిడ్జీ , ఎయిర్పోర్ట్ రోడ్డు నుండి ఖైతాన్కు వెళ్లే రహదారిని ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అన్ని రహదారులపై నిర్వహణ పనులను ప్రారంభించింది. ట్రాఫిక్ సజావుగా ఉండేలా మరియు రద్దీని నివారించడానికి, రహదారి మూసివేతలు మరియు ఓపెనింగ్లకు సంబంధించి మంత్రిత్వ శాఖ సూచనలను అనుసరించాలని పౌరులు నివాసితులకు మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









