ఐదవ రింగ్ రోడ్డులో కొత్త టన్నెల్ ప్రారంభం..!!
- March 02, 2025
కువైట్: దేశంలో రోడ్డు నిర్వహణ పనులు, ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డా. నౌరా అల్-మిషాన్ తెలిపారు. సాల్మియా వైపు నుండి వస్తున్నప్పుడు జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్లో కొత్తగా ప్రారంభించిన టన్నెల్ ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ స్పెసిఫికేషన్లను సాధించడానికి పూర్తి నిబద్ధతతో మంత్రిత్వ శాఖ అన్ని ప్రాంతాలలో రహదారి నిర్వహణ ప్రాజెక్టులను అమలు చేయడం కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
ఐదవ రింగ్ రోడ్లోని ఈ కొత్త టన్నెల్ సౌత్ సుర్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక భాగం. సాల్మియా వైపు టన్నెల్ రెండవ భాగం రాబోయే వారాల్లో పూర్తవుతుంది.గత వారం, ఖైతాన్ బ్రిడ్జీ , ఎయిర్పోర్ట్ రోడ్డు నుండి ఖైతాన్కు వెళ్లే రహదారిని ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అన్ని రహదారులపై నిర్వహణ పనులను ప్రారంభించింది. ట్రాఫిక్ సజావుగా ఉండేలా మరియు రద్దీని నివారించడానికి, రహదారి మూసివేతలు మరియు ఓపెనింగ్లకు సంబంధించి మంత్రిత్వ శాఖ సూచనలను అనుసరించాలని పౌరులు నివాసితులకు మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









