ఐదవ రింగ్ రోడ్డులో కొత్త టన్నెల్ ప్రారంభం..!!
- March 02, 2025
కువైట్: దేశంలో రోడ్డు నిర్వహణ పనులు, ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డా. నౌరా అల్-మిషాన్ తెలిపారు. సాల్మియా వైపు నుండి వస్తున్నప్పుడు జహ్రా వైపు ఐదవ రింగ్ రోడ్లో కొత్తగా ప్రారంభించిన టన్నెల్ ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ స్పెసిఫికేషన్లను సాధించడానికి పూర్తి నిబద్ధతతో మంత్రిత్వ శాఖ అన్ని ప్రాంతాలలో రహదారి నిర్వహణ ప్రాజెక్టులను అమలు చేయడం కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
ఐదవ రింగ్ రోడ్లోని ఈ కొత్త టన్నెల్ సౌత్ సుర్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక భాగం. సాల్మియా వైపు టన్నెల్ రెండవ భాగం రాబోయే వారాల్లో పూర్తవుతుంది.గత వారం, ఖైతాన్ బ్రిడ్జీ , ఎయిర్పోర్ట్ రోడ్డు నుండి ఖైతాన్కు వెళ్లే రహదారిని ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అన్ని రహదారులపై నిర్వహణ పనులను ప్రారంభించింది. ట్రాఫిక్ సజావుగా ఉండేలా మరియు రద్దీని నివారించడానికి, రహదారి మూసివేతలు మరియు ఓపెనింగ్లకు సంబంధించి మంత్రిత్వ శాఖ సూచనలను అనుసరించాలని పౌరులు నివాసితులకు మంత్రి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







