ఐదేళ్ల పాటు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్కు ఖతార్ హోస్ట్..!!
- March 05, 2025
మాడ్రిడ్: దోహాలో వరుసగా ఐదు సంవత్సరాలపాటు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) ప్రకటించింది. ఇది మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి చారిత్రాత్మకమైనదని తెలిపింది. బార్సిలోనాలో MWC 2025 సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఐటీ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అలీ అల్ మన్నాయ్.. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (GSMA) సీఈ జాన్ హాఫ్మన్ ఈ మేరకు అధికారిక హోస్టింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. కంపెనీలు, నిపుణుల మధ్య సహకారం..జ్ఞాన మార్పిడిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ప్రపంచ వేదికగా పనిచేస్తుందని ఐటీ మంత్రి ఉద్ఘాటించారు. ఈ చొరవ డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుందని, ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఖతార్ స్థానాన్ని పటిష్టం చేస్తుందని అన్నారు.
నవంబర్ 25, 26న జరగనున్న MWC దోహా ప్రారంభ ఎడిషన్ మొబైల్ టెక్నాలజీ, ఏఐ, ఆర్థిక సాంకేతికత, స్మార్ట్ కనెక్టివిటీలో తాజా పురోగతులను హైలైట్ చేస్తుంది. ఈ ఈవెంట్ డిజిటల్ స్థిరత్వం, భవిష్యత్తు సాంకేతికతలు వంటి కీలకమైన అంశాలను కూడా అన్వేషిస్తుందని పేర్కొన్నారు. GSMA సీఈఓ జాన్ హాఫ్మన్ మాట్లాడుతూ..“మా ప్రపంచ ప్రఖ్యాత MWC సిరీస్కు MWC25 దోహాను స్వాగతించడానికి మేము సంతోషిస్తున్నాము. డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఖతార్ అభివృద్ధి చెందుతున్న పాత్రకు MWC దోహా సమగ్రంగా మారాలనేది మా మనోగతం. ఏఐ, అధునాతన 5G, స్మార్ట్ మొబిలిటీ అంతటా అదుబాటులోకి తేవడమే మా లక్ష్యం.” అని వివరించారు.
ఖతార్ MWC దోహాను నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఖతార్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉందని, ఇందులో అధునాతన మౌలిక సదుపాయాలు, డిజిటల్ వెంచర్లకు సహాయక నియంత్రణ చట్రాన్ని కలిగి ఉంటుంది. ఖతార్, ప్రపంచ కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇది కొత్త మార్గాలను ఇస్తుందని, ఖతార్ టెక్నాలజీ, డిజిటల్ ఆవిష్కరణలకు ప్రాంతీయ, ప్రపంచ కేంద్రంగా తన స్థానాన్ని బలోపేతం చేస్తుందని కూడా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







