ఐదేళ్ల పాటు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్కు ఖతార్ హోస్ట్..!!
- March 05, 2025
మాడ్రిడ్: దోహాలో వరుసగా ఐదు సంవత్సరాలపాటు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) ప్రకటించింది. ఇది మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి చారిత్రాత్మకమైనదని తెలిపింది. బార్సిలోనాలో MWC 2025 సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఐటీ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అలీ అల్ మన్నాయ్.. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (GSMA) సీఈ జాన్ హాఫ్మన్ ఈ మేరకు అధికారిక హోస్టింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. కంపెనీలు, నిపుణుల మధ్య సహకారం..జ్ఞాన మార్పిడిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ప్రపంచ వేదికగా పనిచేస్తుందని ఐటీ మంత్రి ఉద్ఘాటించారు. ఈ చొరవ డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుందని, ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఖతార్ స్థానాన్ని పటిష్టం చేస్తుందని అన్నారు.
నవంబర్ 25, 26న జరగనున్న MWC దోహా ప్రారంభ ఎడిషన్ మొబైల్ టెక్నాలజీ, ఏఐ, ఆర్థిక సాంకేతికత, స్మార్ట్ కనెక్టివిటీలో తాజా పురోగతులను హైలైట్ చేస్తుంది. ఈ ఈవెంట్ డిజిటల్ స్థిరత్వం, భవిష్యత్తు సాంకేతికతలు వంటి కీలకమైన అంశాలను కూడా అన్వేషిస్తుందని పేర్కొన్నారు. GSMA సీఈఓ జాన్ హాఫ్మన్ మాట్లాడుతూ..“మా ప్రపంచ ప్రఖ్యాత MWC సిరీస్కు MWC25 దోహాను స్వాగతించడానికి మేము సంతోషిస్తున్నాము. డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఖతార్ అభివృద్ధి చెందుతున్న పాత్రకు MWC దోహా సమగ్రంగా మారాలనేది మా మనోగతం. ఏఐ, అధునాతన 5G, స్మార్ట్ మొబిలిటీ అంతటా అదుబాటులోకి తేవడమే మా లక్ష్యం.” అని వివరించారు.
ఖతార్ MWC దోహాను నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఖతార్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉందని, ఇందులో అధునాతన మౌలిక సదుపాయాలు, డిజిటల్ వెంచర్లకు సహాయక నియంత్రణ చట్రాన్ని కలిగి ఉంటుంది. ఖతార్, ప్రపంచ కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇది కొత్త మార్గాలను ఇస్తుందని, ఖతార్ టెక్నాలజీ, డిజిటల్ ఆవిష్కరణలకు ప్రాంతీయ, ప్రపంచ కేంద్రంగా తన స్థానాన్ని బలోపేతం చేస్తుందని కూడా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









