ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ: రచిన్‌, విలియమ్సన్‌ సెంచరీలు..

- March 05, 2025 , by Maagulf
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ: రచిన్‌, విలియమ్సన్‌ సెంచరీలు..

పాకిస్తాన్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా లాహౌర్‌ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో కివీస్‌ రచిన్‌ రవీంద్ర, కెన్‌ విలియ్సన్‌ సెంచరీలతో మెరిశారు. దీంతో న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 366 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ 48 పరుగుల వద్ద 21 పరుగులు చేసి ఓపెనర్‌ విల్‌ యంగ్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్‌ విలియమ్సన్‌తో రచిన్‌ రవీంద్ర 164 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. రచిన్‌ రవీంద్ర 101 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 108 రన్స్‌ చేసి ఔటయ్యాడు. రచిన్‌ ఔటయ్యక కేన్‌ విలియమ్సన్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. డారిల్‌ మిచెల్‌ 37 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్‌తో 49 పరుగులు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com