విశాఖపట్నంలో వైభవంగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ
- March 06, 2025
విశాఖపట్నం: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలోని గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగింది.ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. దగ్గబాటి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడల్లుళ్లు. వీరిద్దరూ కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒకే వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటితో కలిసున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
‘‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎప్పుడూ కూడా మా కుటుంబంలో ఆయన విశిష్టమైన వ్యక్తి. ఇద్దరం కూడా అన్నీ ఎన్టీఆర్ వద్ద నేర్చుకున్నాం. తెల్లవారేసరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయన చెప్పిన పనులు పూర్తిచేసేవాళ్లం. అయితే, వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన చెప్పినప్పుడు ఈ పుస్తకం మీరే రాశారా అని అడిగా. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారంటూ’’ చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







