దుబాయ్ లో ఇద్దరు ఫుట్ బాల్ అభిమానులు అరెస్ట్..!!
- March 06, 2025
దుబాయ్: మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేశారు. మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అభిమానులు అందరూ ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను తీసుకెళ్లవద్దని, కఠినమైన హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. క్రీడా సౌకర్యాలు లేదా ఈవెంట్ వేదికలలో నిషేధించబడిన లేదా ప్రమాదకరమైన పదార్థాలు, ముఖ్యంగా ఫైర్ వర్క్స్ కలిగి ఉంటే మూడు నెలల వరకు జైలు శిక్ష, 30,000 దిర్హామ్ల వరకు జరిమానా విధించవచ్చు. అభిమానులు, ఆటగాళ్లు, అధికారులు, చుట్టుపక్కల ఉన్న వారందరి భద్రతకు హాని కలిగించే ప్రమాదకరమైన పదార్థాలు, ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను స్టేడియంలలో ఉపయోగించవద్దని వారు అభిమానులను కోరారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







