దుబాయ్ లో ఇద్దరు ఫుట్ బాల్ అభిమానులు అరెస్ట్..!!
- March 06, 2025
దుబాయ్: మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేశారు. మ్యాచ్ల సమయంలో డిస్ట్రెస్ సిగ్నల్ ఫ్లేర్లను ఉపయోగించిన ఇద్దరు ఫుట్బాల్ అభిమానులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అభిమానులు అందరూ ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను తీసుకెళ్లవద్దని, కఠినమైన హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. క్రీడా సౌకర్యాలు లేదా ఈవెంట్ వేదికలలో నిషేధించబడిన లేదా ప్రమాదకరమైన పదార్థాలు, ముఖ్యంగా ఫైర్ వర్క్స్ కలిగి ఉంటే మూడు నెలల వరకు జైలు శిక్ష, 30,000 దిర్హామ్ల వరకు జరిమానా విధించవచ్చు. అభిమానులు, ఆటగాళ్లు, అధికారులు, చుట్టుపక్కల ఉన్న వారందరి భద్రతకు హాని కలిగించే ప్రమాదకరమైన పదార్థాలు, ఫైర్ వర్క్స్ లేదా మండే పదార్థాలను స్టేడియంలలో ఉపయోగించవద్దని వారు అభిమానులను కోరారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









