ఆగస్టు 15న ప్రారంభింకానున్న 'స్వయం'
- July 04, 2016
సామూహిక ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (మూక్) ప్లాట్ఫామ్ 'స్వయం'ను ఆగస్టు 15న ప్రారంభించాలని మానవ వనరుల శాఖ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, పంద్రాగస్టున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంఛనంగా ఆరంభించే అవకాశం ఉందని శాఖ వర్గాలు తెలిపాయి. సమాచార సాంకేతికతతో నడిచే వ్యవస్థ 'స్వయం'లో 2 వేలు పైబడిన కోర్సులు 3 కోట్ల మంది విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.9-12 తరగతుల నుంచి డిగ్రీ , పీజీ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఒకేసారి 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునేలా సాయపడే నె ట్వర్క్ దీనిలో భాగం కానుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే రెండున్నర లక్షల గంటల పైబడిన ఈ-సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పాఠ్యాంశ వనరుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ కోర్సుల ద్వారా సాధించిన క్రెడిట్లు విద్యార్థుల కాలేజీలు, పాఠశాలలకు పంపిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







