ఆగస్టు 15న ప్రారంభింకానున్న 'స్వయం'
- July 04, 2016
సామూహిక ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (మూక్) ప్లాట్ఫామ్ 'స్వయం'ను ఆగస్టు 15న ప్రారంభించాలని మానవ వనరుల శాఖ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, పంద్రాగస్టున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంఛనంగా ఆరంభించే అవకాశం ఉందని శాఖ వర్గాలు తెలిపాయి. సమాచార సాంకేతికతతో నడిచే వ్యవస్థ 'స్వయం'లో 2 వేలు పైబడిన కోర్సులు 3 కోట్ల మంది విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.9-12 తరగతుల నుంచి డిగ్రీ , పీజీ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఒకేసారి 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునేలా సాయపడే నె ట్వర్క్ దీనిలో భాగం కానుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే రెండున్నర లక్షల గంటల పైబడిన ఈ-సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పాఠ్యాంశ వనరుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ కోర్సుల ద్వారా సాధించిన క్రెడిట్లు విద్యార్థుల కాలేజీలు, పాఠశాలలకు పంపిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









