విమానంలో అల్లాహు అక్బర్ అని అరిచి జైలు పాలయ్యాడు
- July 04, 2016
అవును.. గాల్లో విమానం వెళ్తున్నప్పుడు ప్రయాణికుల్లో ఎవరైనా 'అల్లాహు అక్బర్' అని అరిస్తే.. ఇంకేమైనా ఉందా. ప్రయాణికులు బెంబేలెత్తిపోతారు. ఉగ్రవాది ఏమోనని వణికిపోతారు. ఎందుకంటారా.. ఇటీవల దాడులకు ముందు తీవ్రవాదులు 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నారు కాబట్టి. ఇదే అనుభవం దుబాయ్ నుంచి బర్మింగ్హామ్ వెళ్తున్న ఎమిరేట్స్కు చెందిన బోయింగ్ 777 విమానంలో ప్రయాణికులకు ఎదురైంది. ఫిబ్రవరి 1న ఈ ఘటన జరిగింది. 347 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో 38 ఏళ్ల షెహ్రాజ్ సర్వార్ కూడా ఉన్నాడు. విమానం గాల్లో ఉండగా సర్వార్ ఒక్కసారిగా 'అల్లాహు అక్బర్' అని గట్టిగా అరిచాడు. అంతే విమానంలో ఉగ్రవాది ఉన్నాడని భావించిన ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో వణికిపోయారు. కొందరైతే ఏడ్చేశారు కూడా. టేకాఫ్ సమయంలోనూ అతను వింతగా ప్రవర్తించాడు. సిబ్బంది సీటు బెల్టు పెట్టుకోమంటే రెండు సార్లు తిరస్కరించాడు. ఆహార పదార్థాలను కేబిన్లో విసిరికొట్టాడు. ఆ తర్వాత విమానం బర్మింగ్హాం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్నప్పుడు మరోమారు 'భూం' అంటూ పెద్దగా అరిచాడు. అతడి అనుమానాస్పద ప్రవర్తనపై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. కేసును విన్న బర్మింగ్హాం క్రౌన్ కోర్టు రెండు నెలల తర్వాత తుదితీర్పు వెల్లడించింది. సర్వార్ను దోషిగా తేలుస్తూ పది వారాల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







