మరోసారి బాంబులతో మారుమోగిన సౌదీ

- July 04, 2016 , by Maagulf

సౌదీ అరేబియాలో మరోసారి ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఖతీఫ్ లోని ఓ ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మదీనాలోని సెక్యూరిటీ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం జెడ్డాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అతడిని నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తునాతునకలయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న మసీదు వైపుగా వెళుతూ అతడు ఈ ఘాతుకానికి దిగాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com