ఆటా లో సీరియస్ అయ్యిన రసమయి బాలకిషన్

- July 04, 2016 , by Maagulf
ఆటా లో సీరియస్ అయ్యిన రసమయి బాలకిషన్

చికాగోలో జూలై1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఆటా సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే.. రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. జీవితంలో ఇక మీ ఆటా ప్రోగ్రామ్ లో మా తెలంగాణ పాట ఉండదని చెప్పారు. నేను ఎమ్మెల్యేని.. కేబినెట్ మినిస్టర్ ర్యాంకు కల్గిన సాంస్కృతిక సారధి ఛైర్మన్ నేను.. ఈ వేదిక మీద తాను పాట పాడటమన్నది మీ అదృష్టంగా భావించుకో.. అని స్టేజ్ పైన తన అసహనాన్ని వ్యక్తం చేశారు బాలకిషన్.
ఇంతకీ రసమయి కోపానికి కారణమైన విషయం ఏంటంటే, స్టేజ్ పైకొచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు మణిశర్మ ప్రోగ్రామ్ ఇస్తారు..ఆయన రెడీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది ఈలోపు రసమయి బాలకిషన్ పాడతారని చెప్పడంతో స్టేజ్ మీదకి బాలకిషన్ వచ్చి పాడేందుకు సిద్దపడ్డ బాలకిషన్ ను కొందరు అడ్డుకున్నారు. కేకలు, అరుపులతో అతని ప్రోగ్రామ్ ని ఆపేందుకు ప్రయత్నంచడంతో రసమయి పై విధంగా రియాక్ట్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com