టెర్రర్‌ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

- July 04, 2016 , by Maagulf
టెర్రర్‌ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

దాయిష్‌ తీవ్రవాద సంస్థ దేశంలో ఉగ్రదాడులకు పథక రచన చేయగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ కుట్రను భగ్నం చేశారని కువైట్‌ ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మూడు కేసుల్లో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటీరియర్‌ మినిస్ట్రీ తెలిపింది. కువైట్‌కి చెందిన తలాల్‌ నయెఫ్‌ రాజా, దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన ఎస్టాబ్లిష్‌మెంట్‌పై దాడికి ఇతను కుట్రపన్నాడు. దయీష్‌ నుంచి తనకు అందిన ఆదేశాల మేరకు దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఓ తుపాకీతోపాటు, ఎక్స్‌ప్లోజివ్‌ బెల్ట్‌ ధరించి దాడులకు పాల్పడాలనుకున్నట్లు వివరించాడు నిందితుడు. మరో కేసులో అలి మొహమ్మద్‌ ఒమర్‌ అనే వ్యక్తితోపాటు అతని తల్లి అబ్దుల్లా మొహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా దాయీష్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కువైట్‌కి చెందిన ఓ వ్యక్తి అలాగే ముబారక్‌ ఫహాద్‌ అనే గల్ఫ్‌ నేషన్‌కి చెందిన మరో వ్యక్తి, వీరితోపాటు ఆసియాకి చెందిన మరో వ్యక్తి గ్రూపుగా ఏర్పడి తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తుండగా వారినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టుల సందర్భంగా వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com