టెర్రర్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 04, 2016
దాయిష్ తీవ్రవాద సంస్థ దేశంలో ఉగ్రదాడులకు పథక రచన చేయగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ కుట్రను భగ్నం చేశారని కువైట్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మూడు కేసుల్లో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది. కువైట్కి చెందిన తలాల్ నయెఫ్ రాజా, దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన ఎస్టాబ్లిష్మెంట్పై దాడికి ఇతను కుట్రపన్నాడు. దయీష్ నుంచి తనకు అందిన ఆదేశాల మేరకు దాడులకు పాల్పడేందుకు సమాయత్తమవుతున్నట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఓ తుపాకీతోపాటు, ఎక్స్ప్లోజివ్ బెల్ట్ ధరించి దాడులకు పాల్పడాలనుకున్నట్లు వివరించాడు నిందితుడు. మరో కేసులో అలి మొహమ్మద్ ఒమర్ అనే వ్యక్తితోపాటు అతని తల్లి అబ్దుల్లా మొహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా దాయీష్ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కువైట్కి చెందిన ఓ వ్యక్తి అలాగే ముబారక్ ఫహాద్ అనే గల్ఫ్ నేషన్కి చెందిన మరో వ్యక్తి, వీరితోపాటు ఆసియాకి చెందిన మరో వ్యక్తి గ్రూపుగా ఏర్పడి తీవ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తుండగా వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుల సందర్భంగా వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







